NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైలంలో అర్ధ‌రాత్రి ఉద్రిక్త‌త !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ్రీశైలంలో అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దేవాలయం పరిసరాల్లో కన్నడ భక్తులు బీభత్సం సృష్టించారు. కురుబల సత్రం టీ కొట్టు దగ్గర వ్యాపారస్తుడితో కర్నాటక భక్తుడు, షాప్ యజమాని మధ్య వాటర్‌ బాటిల్‌ విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య మాటమాటా పెరిగడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఆగ్రహానికి గురైన షాపు యజమాని కర్నాటక భక్తుడిపై గొడ్డలితో దాడి చేశాడు. దాడిలో భక్తుడికి తీవ్రగాయాలయ్యాయి. తనతో ఉన్న మిగతా కన్నడ భక్తులు ఆగ్రహంతో టీషాప్‌ను దహనం చేశారు. సమీపంలోని షాపులపై కూడా దాడి చేసి.. ఫర్నీచర్‌ను కర్నాటక భక్తులు ధ్వంసం చేశారు. ఘటనపై స్థానికులు పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

                                                 

About Author