PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమార్కుల గుండెల్లో మిడుతూరు ఎస్ఐ

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు గత నెల సెప్టెంబర్ 16వ తేదీన బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ ఎం.జగన్ మోహన్ అక్రమార్కుల గుండెల్లో హడలెత్తిస్తున్నారు. సోమవారం ఇద్దరిపై కేసు నమోదు చేశారు.మండల పరిధిలోని నాగలూటి గ్రామంలో నందికొట్కూరు నీలి షికారి పేటకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి గ్రామంలో 20 లీటర్ల సారాయి అమ్ముతుండగా సిబ్బందితో కలిసి ఎస్సై దాడులు చేసి పట్టుకున్నారు.ఇతనిపై కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్ కు తరలించినట్లు అంతేకాకుండా రోళ్లపాడు గ్రామంలో సాయంత్రం ఎస్సై దాడులు చేసి గ్రామానికి చెందిన సునీల్ దగ్గర నుంచి 12 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని ఇతని పైన కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఎస్సై ఎం.జగన్ మోహన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author