PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యోగాతో.. ‘మైండ్​’ కంట్రోల్​..!

1 min read

ఆసనాలతో అత్యద్బుత ఫలితం..

  • యోగా గురువు సుధాకర్​
  • 19 నుంచి యోగాపై శిక్షణ

పల్లెవెలుగు, కర్నూలు:స్థిరత్వం లేని ఆలోచనతో నిండి ఉన్న ‘మైండ్​’ ను కంట్రోల్​ చేసే శక్తి ఒక్క యోగాకే సాధ్యమవుతుందన్నారు యోగా గురువు సుధాకర్​.  యోగాసనాలతో అత్యద్భుత ఫలితం పొందుతారన్న ఆయన ​… యోగాను నిత్యకృతిలో భాగంగా  మార్చుకోవాలని సూచించారు. ఆదివారం నగరంలోని కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​  ఆధ్వర్యంలో యోగాపై గురువు సుధాకర్​ అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో యువత చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. మద్యం, సిగరెట్లు… అపరిమితంగా సెల్​ఫోన్లు చూడటం… సినిమాలు చూడటం వంటివి చేయడం వల్ల మనిషి మానసిక స్థితి కుచించుకుపోతోంది. అంతేకాక డృడ సంకల్పంతో కూడిన మంచి ఆలోచనలు, గట్టి నిర్ణయాలు స్వతహాగా తీసుకునే శక్తి కోల్పోయే ప్రమాదం ఉంది.  ఇలాంటివన్నీ కంట్రోల్​ కావాలంటే…. ముందుగా మెదడు (మైండ్​)ను కంట్రోల్​లో పెట్టుకోవాలి. ఇది ఒక్క యోగాతోనే సాధ్యమవుతుందని, అందుకే ప్రతి ఒక్కరు యోగాసనాలు చేయాలని ఈ సందర్భంగా యోగా గురువు సుధాకర్​ వెల్లడించారు.  అనంతరం హార్ట్​ ఫౌండేషన్​ సభ్యులు యోగా గురువు సుధాకర్​ను ఘనంగా సన్మానించారు.

19 నుంచి యోగాపై శిక్షణ..

నగరంలోని కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ కార్యాలయ ఆవరణలో ఈ నెల 19 (మంగళవారం) నుంచి పది రోజులపాటు యోగాపై శిక్షణ ఇస్తున్నట్లు గురువు సుధాకర్​ వెల్లడించారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు యోగాపై ప్రత్యేక శిక్షణ ఇస్తామని,  నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ సెక్రటరి , ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా. చంద్రశేఖర్​, ప్రముఖ గ్యాస్ర్టో ఎంట్రాలజిస్ట్​ వైద్య నిపుణులు డా. శంకర్​ శర్మ, ముస్లిం మైనార్టీ జిల్లా అధికారి మహబూబ్​ బాష , ఫౌండేషన్​ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author