NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి గుమ్మ‌నూరి జ‌య‌రాం పై ఈడీ విచార‌ణ చేయాలి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పశ్చిమబెంగాల్‌ మంత్రి పార్థు చటర్జీకి పట్టిన గతే ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరామ్‌కు పట్టాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మంత్రి జయరామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌తో విచారణ జరిపిస్తే… బెంగాల్‌ మంత్రిని అరెస్టు చేసినట్లే జయరాజ్‌నూ అరెస్టు చేయొచ్చు. సీఎంకి ఏమాత్రం నైతిక విలువలున్నా ఈడీ దర్యాప్తునకు ఆదేశించాలి. కార్మిక శాఖ అధికారుల బదిలీల్లో మంత్రి ఎన్ని లక్షలు దిగమింగారో లెక్క తేల్చాలి. కార్మిక శాఖ అధికారుల బదిలీ విషయంలో కమిషనర్‌ కార్తికేయ మిశ్రా తన మాట వినలేదని మంత్రి ఆయన ఉత్తర్వులను పక్కనపెట్టారు. జాయింట్‌ కమిషనర్‌ని అధీనంలోకి తెచ్చుకుని, ఆయనతో ఉత్తర్వులు ఇప్పించారు. ఈ మొత్తం వ్యవహారంపై సీఎం జగన్‌, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని వర్ల డిమాండ్‌ చేశారు.

                                

About Author