NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి నా మూడెక‌రాల భూమి క‌బ్జా చేశారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మ‌ంత్రి ఆదిమూల‌పు సురేష్ పై ఓ వృద్ధురాలు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. తన మూడెకరాల భూమిని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఆక్రమించుకొని ఇంజనీరింగ్‌ కళాశాలలో కలిపేసుకున్నారని ఆమె ఆరోపించారు. మార్కాపురం మండలం దరిమడుగుకి చెందిన కేసరి రంగలక్ష్మమ్మ అనే వృద్ధురాలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆమె కలెక్టర్‌ దినే్‌షకుమార్‌కు ఈమేరకు ఫిర్యాదు చేశారు. పలుమార్లు మంత్రులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, సీఎం వద్దకు వెళ్లేందుకు కూడా ప్రయత్నించామని చెప్పారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని ఆమె బోరున విలపించారు. ఇంతలో పోలీసులు హుటాహుటిన వచ్చి ఆమెను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. దీనిపై రంగలక్ష్మమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

                                   

About Author