PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డ్రగ్స్ కేసు: మాజీ ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు

1 min read


పల్లెవెలుగు వెబ్: ముంబై డ్రగ్స్ కేసు అంశంపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య వివాదం కొనసాగుతోంది. గత కొన్ని రోజుల నుంచి వీరి మధ్య మాటలు తుటాల్లా పేలుతున్నాయి. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలతో మరాఠ రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి నవాబ్ మాలిక్ రూ.5 కోట్ల నష్టపరిహారం కోరుతూ పడ్నవీస్‌కు లీగల్ నోటీస్ పంపారు. లాయ‌ర్ రెహ్మాత్ అన్సారీ ద్వారా నోటీసులు పంపిన‌ట్లు మాలిక్ కూతురు నీలోఫర్ మాలిక్ ఖాన్ మీడియాకు తెలిపారు. ఫడ్నవీస్ స్పంద‌న కోసం ఎదురుచూస్తున్నామ‌ని… ఆయ‌న స్పందించిన త‌ర్వాత త‌దుప‌రి చర్యలు తీసుకుంటామని మాలిక్ కూతురు స్పష్టం చేశారు. ఫడ్నవీస్ క్షమాప చెప్పకుంటే.. నష్టపరిహారం ద్వారా కోర్టు వెళతామని ఆమె మీడియాకు వెల్లడించింది.

About Author