PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంటర్‌వెల్ మాత్రమే.. శుభం‌కార్డు త్వరలోనే: మంత్రి పెద్దిరెడ్డి

1 min read


పల్లెవెలుగు వెబ్: మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ నిర్ణయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. అమరాతి రైతుల పాదయాత్ర చూసి బిల్లును వెనక్కితీసుకోలేదన్నారు.‘ ఇది ఇంటర్‌వెల్ మాత్రమే.. శుభంకార్డుకు మరింత సమయం పడుతుంది. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశాం. నేను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాను. అమరావతి రైతుల పాదయాత్రలో అంతా పెయిడ్‌ ఆర్టిస్టులే. బిల్లు ఉపసంహరణకు సంబంంధించి పూర్తి వివరాలు సీఎం జగన్ అసెంబ్లీలో వివరిస్తారు.’ అని మంత్రి రామచంద్రారెడ్డి చెప్పారు.

About Author