NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు..కలెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్  కర్నూలు : వినాయక చవితి సందర్భంగా  రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు.  మట్టి గణపతిని పూజించి వినాయక చవితిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని  వారు పిలుపు నిచ్చారు.

About Author