బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మైనార్టీ నాయకులు
1 min read
ప్యాపిలి, న్యూస్ నేడు: బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఈరోజు డోన్ పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీ టీడీపీ నాయకులు, ముస్లిం సోదరులు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి ని మర్యాద పూర్వకముగా కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.త్యాగానికి, సహనానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను శాంతి సామరస్యాలు వెల్లువిరిసేలా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ధర్మవరం సుబ్బారెడ్డి ముస్లిం సోదరులకీ బక్రీదు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిఎడ్ బాషా, మార్కెట్ వలి, ఖాదర్, అజిజ్, గుల్షన్ తదితరులు పాల్గొన్నారు.