PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మిథాలీరాజ్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భారత మహిళా జట్టు సీనియర్ క్రికెటర్ మిథాలీరాజ్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసింది. తాను అన్నిఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా మిథాలీ ప్రకటించింది. మిథాలీ మొత్తం 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ-20లు ఆడింది. 12 టెస్టుల్లో మిథాలీరాజ్‌ 699 పరుగులు చేసింది. ఇక 232 వన్డేల్లో మిథాలీరాజ్‌ 7805 పరుగులు సాధించింది. వన్డేల్లో ఇన్ని పరుగుల మైలురాయిని అధిగమించిన ఏకైక మహిళా క్రికెటర్‌ మిథాలీనే కావడం విశేషమని చెప్పుకోవచ్చు. 89 టీ-20ల్లో ఈమె 2354 పరుగులు చేసింది.

                                          

About Author