PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే.. ఎంపీ సీట్లు స్థానికులకు మాత్రమే ఇవ్వాలి

1 min read

– గుడిసె శివన్న కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు కష్టపడ్డ వారికి తమ పార్టీలో ప్రజాసేవ కలవారికి స్థానికులకు మాత్రమే సీట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం వైఎస్ఆర్సిపి బిజెపి కాంగ్రెస్ తదితర పార్టీలు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కేటాయింపులో కచ్చితంగా స్థానికులకే ఇవ్వాలి. అలాగే పార్టీలో  కష్టపడి పనిచేసిన సేవా దృక్పథం ఉన్న నాయకులకు మాత్రమే సీట్లు ఇవ్వాలని సేవా దృక్పథం లేని నాయకులకు కానీ స్థానికేతరులకు గాని సీట్లు కేటాయిస్తే ఆ పార్టీకి మా కురువ కులస్తుల మద్దతు ఉండదని హెచ్చరించారు. ఈ జిల్లాలో నేతలు లేరా మీకు చేత కాదా అని ప్రశ్నించారు. స్థానిక  బిసిల పట్ల చిన్నచూపుతో వేరే ప్రాంతానికి చెందిన వారికి కర్నూలు జిల్లాలో సీట్లు కేటాయించ వద్దని ఆయన అన్నిపార్టీ అధిష్టానాలకు పత్రికా ముఖంగా విన్నవించారు ఒక వేళ ఏ పార్టీ అయినా ఇతర జిల్లాలకు చెందిన వారికి సీట్లు కేటాయిస్తే అ సీటును వదులుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.

About Author