PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంత్యక్రియలకు హాజరైన ఎంఎల్​ఏ ఆర్థర్

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: కేసీ కెనాల్ డివిజన్ శాఖ లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నెత్తికొప్పుల ప్రసాద్ తండ్రి నెత్తికొప్పుల బాల చెన్నయ్య శుక్రవారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలను కుటుంబ సభ్యులు శనివారం కర్నూలులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ. బ్రహ్మానంద రెడ్డి తో కలిసి నందికొట్కూరు శాసనసభ్యులు తొగురు.ఆర్థర్ హాజరయ్యారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి విశ్రాంత అధికారి మాధవరం యేసురత్నం , నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ సగినెల.ఉసేనయ్య , తుమ్మలూరు గ్రామ సర్పంచ్ వనమాల ప్రసాదరావు , వైసీపీ నాయకులు దుద్యాల రఫీ , చెవుల సుధాకర్ రెడ్డి , గువ్వలకుంట్ల సహదేవుడు , పాములపాడు రాజశేఖర్, వేంపెంట దేవదాసు, వైసీపీ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

About Author