PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీనియర్ నేతను పరామర్శించిన ఎమ్మెల్యే ఆర్థర్

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామానికి చెందిన వైసీపీ మైనారిటీ సీనియర్ నాయకులు మొల్ల అబ్దుల్ ముజీబ్(75)గత రెండు వారాల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చారు.విషయాన్ని తెలుసుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ శుక్రవారం ఉదయం వారి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.అదేవిధంగా మీరు త్వరగా కోలుకోవాలని మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని మీరు ధైర్యంగా ఉండాలని అంతే కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధికి మంజూరు కొరకు పంపిస్తానని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.తర్వాత ఎమ్మెల్యే గ్రామ వైసీపీ నాయకులు సల్కోటి గోవర్ధన్ రెడ్డి తండ్రి అయిన జయరామిరెడ్డిని వారి ఇంటికి వెళ్లి పలకరించారు.ఈ కార్యక్రమంలో మొల్ల సమీవుల్ల,షఫీ మరియు వివిధ గ్రామాల నాయకులు వెంకట్, పుల్లయ్య,ఇనాయతుల్ల, చంద్ర శేఖర రెడ్డి,నడిపి నాగన్న,జాన్ తదితరులు పాల్గొన్నారు.

About Author