NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యే పరామర్శ…

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని రామన పల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు సదాశివరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడడం జరిగింది, ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆదివారం రామనపల్లిలోని సదాశివరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు, అదేవిధంగా ప్రమాదం ఎలా జరిగిందని వాకాబు చేశారు, కాలుకు తగిలిన గాయాలు మానేంతవరకు బెడ్ రెస్ట్ తీసుకోవాలని ఆయన సదాశివారెడ్డికి సూచించారు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి మసిమా బాబు ప్రమాదం కు సంబంధించిన విషయాలను ఎమ్మెల్యేకి వివరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో రామనపల్లి వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author