NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జగన్ సర్కార్‌పై సొంతపార్టీ ఎమ్మెల్యే ధర్మాన విమర్శలు

1 min read


పల్లెవెలుగు వెబ్: వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. సర్కార్ పనులను చేసిన వారికి బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎస్ఎస్ఆర్ రేట్లు అధ్వానంగా ఉన్నాయని.. మరోపక్క బహిరంగ మార్కెట్‌లో సిమెంట్, స్టీల్, ఇసుక ధరలు ఆకాశన్నంటుతున్నాయని… పరువు కోసం పనులు చేస్తే.. తీరా ఇప్పుడు నానా ఇబ్బందులు పడాల్సివస్తోందని ధర్మాన వ్యాఖ్యానించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ప్రభుత్వ మెప్పు కోసం అధికారులు తప్పుడు సలహాలు ఇవ్వొద్దని.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని వాపోయారు. శ్రీకాకుళం జిల్లాలో పేదల జీవన ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని.. వేలాది మంది వలస వెళ్తున్నారని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం కూడా సరిగా అమలు కావడం లేదన్నారు.

About Author