PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైయస్ఆర్ జలకళ ద్వారా మోటార్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  పెదవేగి ఎండీఓ కార్యాలయం వద్ద వైయస్ఆర్ జలకళ ద్వారా అర్హులైన రైతులకు దెందులూరు ఎమ్మెల్యే శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి  మోటార్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి  మాట్లాడుతూ, వైయస్ఆర్ జలకళ కార్యక్రమం ద్వారా రైతులకు ఉచిత బోర్లు వేసి ప్రతి ఎకరా సాగు భూమికి సాగునీరు అందించడం జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం బోర్‌వెల్ లేని, 2.5 ఎకరాల భూమి ఉన్న రైతులు ఎవరైనా అర్హులని పక్కపక్కనే 2.5 ఎకరాల భూమి భూమి ఉన్న రైతులు ఒక గ్రూప్ గా ఏర్పడి ఉచిత బోర్‌వెల్ పొందేందుకు కుడా ఈ పథకంలో అవకాశం ఉందని పేర్కొన్నారు. చిన్న & సన్నకారు రైతులకు మరియు ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి  పేర్కొంటూ ఈ రోజు జలకళ ద్వారా లబ్ధి పొందిన రైతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మరియు ఎంపీడీవో రాజ్ మనోజ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయబాబు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

About Author