NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గౌరవ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలసి, కర్నూల్ నగరంలో రూ.16.23 కోట్లతో రహదారుల విస్తరణ పనులకు అభివృద్ధి నిధులు మంజూరు చేసినందుకు గాను అలాగే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నేషనల్‌ లా యూనివర్సిటీ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపినందుకు సీఎం జగన్ గారికి ధన్యవాదాలు తెలిపారు.కర్నూల్ నగర అభివృద్ధి గురించి అలాగే పలు అంశాల గురించి సీఎం గారితో చర్చించడం జరిగింది.ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి కర్నూల్ నగర అభివృద్ధి కొరకు తన దృష్టికి తెచ్చినా సమస్యలను త్వరగా పరిష్కరిస్తాం అని కర్నూలు శాసన సభ్యులు హఫీజ్ ఖాన్ గారికి భరోసా ఇవ్వడం జరిగింది.

About Author