PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే జోగిరమేష్​, అతడి అనుచరులపై చర్యలు తీసుకోవాలి

1 min read

– టీడీపీ బీసీ సెల్​ రాష్ట్ర నాయకులు రాజు యాదవ్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి పై గత శుక్రవారం ఎమ్మెల్యే జోగి రమేష్​, ఆయన అనుచరులు దాడి చేశారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు టీడీపీ రాష్ట్ర బీసీ సెల్​ నాయకులు ఎంవి ఎన్​ రాజు యాదవ్​. శనివారం కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్​కుమార్​ రెడ్డిని కలిసి ఎమ్మెల్యే జోగిరమేష్​, ఆయన అనుచరులపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాజు యాదవ్​ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రనాయుడు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్​, తన అనుచరులు, రౌడీ మూకలతో కలిసి దాడి చేశారని, ఇదేమని ప్రశ్నించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడికి పూనుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనకు కారకులైన జోగిరమేష్​, తన అనుచరులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో ఐటీడీపీ పార్లమెంట్ ఇంచార్జి తిలక్ గట్టు , ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు థరూర్ జేమ్స్ , టీడీపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు హనుమంత్ రావు చౌదరి, లీగల్ సెల్ ప్రసాద్, తెలుగు యువత ఉపాధ్యక్షులు పేరుపోగు రాజు , 33 వార్డ్ ఇంచార్జి ఎన్ వి గోపి, పాణ్యం సోషల్ మీడియా సభ్యులు వక్కల గోపి కృష్ణ , వీరేష్ పాల్గొన్నారు.

About Author