NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా సీతారాముల కళ్యాణం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేడా

1 min read

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లి మండలంలోని సంఘం వాళ్ళ పల్లె గ్రామపంచాయతీలోని గ్రంధే వాండ్ల పల్లెలో శనివారంశ్రీరామనవమి వేడుకలలో భాగంగాఘనంగా సీతారాముల కళ్యాణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ర రెడ్డి హాజరయ్యారు. .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవునికి భక్తితోనే ముక్తి సాధ్యమవుతుందని ఈ విషయం గమనించి ప్రతి ఒక్కరూభక్తితో స్వాములవారికి పూజలు చేయాలన్నారు.అలా చేసినప్పుడే దేవుని కృపతో ఆయురారోగ్యాలతో పాడిపంటలతో ఆర్థిక అభివృద్ధి చెందుతారన్నారు.అనంతరం రాజంపేట రెవిన్యూ డివిజన్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మరి యు వై సీ పీ నాయకులు రవి శంకర్ ఎం ఎల్ ఏ మేడాను ఏం పి పి రాజేంద్ర నాథ్ రెడ్డి , సింగల్ విండో అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి ని జడ్పిటిసి శివరామను శాలువాలు కప్పి ఘనం గా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి జెడ్పి టి సీ శివరామ సర్పంచులు నేతి ఆంజనేయులు గోపీనాథ్ రెడ్డి,స్వామి సింగల్ విండో అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి సింగల్ విండో అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author