PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మృత దేహాలకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని సుంకేసుల గ్రామానికి చెందిన తిమ్మాపురం చిన్న సామన్న(62)మృతి చెందడంతో ఈయన మృతదేహానికి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కర్నూలులోని అమీలియో ఆసుపత్రి మరియు హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నారని చికిత్స అనంతరం శుక్రవారం రాత్రి గ్రామానికి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో మరణించినట్లు వారు తెలిపారు.విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే జయసూర్య శనివారం ఉదయం 8:45 గంటల సమయంలో గ్రామానికి చేరుకుని ఆయన మృతదేహానికి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. అదేవిధంగా అల్లూరు గ్రామంలో అనారోగ్యంతో మరణించిన రమజాబి మృతదేహానికి ఎమ్మెల్యేతో పాటుగా నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి,మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి,సుంకేసుల భూపాల్ రెడ్డి,సుబ్బారావు, వెంకటయ్య,జనార్దన్ గౌడ్, పగడం శేఖర్,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author