PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి   

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బుధవారం పలువురి బాధిత కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారు. మద్దికెర మండలం బురుజుల గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు జయ భరత్ రెడ్డి వదిన గారు నిన్న గుండె పోటుతో మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ  ఉదయం గురు జిల్లా గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. అలాగే కర్నూల్ సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, అనారోగ్యంతో మృతి చెందిన పత్తికొండ మండలం దూదేకొండ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త చక్రప్ప మృతదేహానికి పూలమాల వేసి, నివాళులర్పించి, ఎమ్మెల్యే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అంతేకాకపత్తికొండ పట్టణం, టీచర్స్ కాలనీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త గార్మెంట్ షాప్ మస్తాన్ గారి తండ్రి కౌతలం హుస్సేన్ సాహెబ్ నిన్న గుండె పోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ  కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు.ఎమ్మెల్యే  వెంట వైఎస్ఆర్ పార్టీ నాయకులు పత్తికొండ ఎంపీపీ దాసు, తదితరులు ఉన్నారు.మద్దికెర మండలం బురుజుల గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు జయ భరత్ రెడ్డి వాళ్ళ వదిన నిన్న గుండె పోటుతో మృతి చెందారు విషయం తెలిసిన *ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారు ఈరోజు ఉదయం పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు.

About Author