PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హౌసింగ్ అధికారులతో ఎంఎల్ఏ సమీక్ష సమావేశం

1 min read

– జగనన్న ఇళ్ల నిర్మాణాల పురోగతిని త్వరగ తిన పరిష్కరించాలి:ఎమ్మెల్యే అబ్బాయ్య చౌదరి
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : ఈరోజు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఏలూరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమావేశ మందిరంలో హౌసింగ్ అధికారులతో దెందులూరు నియోజకవర్గంలో హౌసింగ్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వైయస్ఆర్ జగనన్న కాలనీల్లో పూర్తయిన ఇళ్ల గురించి మరియు జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించాలని అలాగే నిర్దేశిత గడువు లోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తీ చేయాలని ఎమ్మెల్యే అధికారులను సూచించారు. అదే విధంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఇళ్ల స్థలాలు, నిర్మాణాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు,ఈ సమావేశంలో పీడీ వేణుగోపాల్,ఎస్ఈ ఏలూరు ఎంపీపీ పెన్మత్స శ్రీనివాసరాజు,పెదవేగి ఎంపీపీ తాతా రమ్య పెదవేగి ఎంపీడీవో లక్ష్మి ,ప్రజా ప్రతినిధులు,నియోజకవర్గ మరియు మండల స్థాయి అధికారులు,నియోజకవర్గ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author