PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తక్షణమే.. సమస్యల పరిష్కారంవైపు ఎమ్మెల్యే శిల్పా

1 min read

– ప్రతి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తేనే సమస్యలు పరిష్కరిస్తారా..!
– ప్రజలు స్వయంగా అధికారులకు సమస్యలు తెలియజేస్తే స్పందించరా..!
పల్లెవెలుగు , వెబ్​ ఆత్మకూరు : ఆత్మకూర్ పట్టణంలోని 6వ వార్డులో మంగళవారం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గడప గడపకు కార్యక్రమంలో కాలనీవాసులు విద్యుత్ స్తంభం విరిగి రెండు సంవత్సరాలు అయిందని విద్యుత్ అధికారులకు తెలిపిన సమస్యను పరిష్కరించలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఎమ్మెల్యే విద్యుత్ ఏఈ రమేష్ కుమార్ కు సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఏఈ రమేష్ కుమార్ వెంటనే స్పందించి నేడు నూతన విద్యుత్ స్తంభం ను ఏర్పాటు చేశారు. ప్రజలు స్వయంగా అధికారులకు సమస్యలు తెలియజేస్తే స్పందించరా..! అని, ప్రతి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తేనే సమస్యలు పరిష్కరిస్తారా..! అని అధికారులను పలువురు విమర్శించారు. ప్రజలు తెలియజేసిన సమస్యలను కూడా త్వరతగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏది ఏమైనప్పటికీ రెండు సంవత్సరాల తర్వాత సమస్య పరిష్కారం కావడంతో కాలనీవాసులు ఎమ్మెల్యేకు, అధికారులకు ధన్యవాదములు తెలిపారు.

About Author