NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దుర్గా భోగేశ్వరుడుని దర్శించుకున్న పాణ్యం ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  దక్షిణ కాశీగా పేరుందిన శ్రీ దుర్గా భోగేశ్వర దేవాలయంలో శనివారం నాడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ చైర్మన్ ఐసాని సునీల్ కుమార్ రెడ్డి లు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి పూలమాలలతో శాలువాలతో సత్కరించి దేవాలయం జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో దాతలు ఆర్జియం ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మిద్దె శివరామ్ సహకారంతో 20 లక్షలతో ఏర్పాటుచేసిన కళ్యాణమండపం వసతిగృహాలను ప్రారంభించారు. అనంతరం మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటుచేసిన బండలాగుడు పందెం పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author