PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైస్-చైర్మన్ రబ్బాని బ్రదర్స్ ఏర్పాటు చేసిన విందుకు హాజరైన ఎమ్మెల్యే

1 min read

– విందుకు హాజరైనా అధికారులు,వైసీపీ నాయకులు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రంజాన్ పండుగ పర్వదినాని పురస్కరించుకొని మున్సిపల్ వైస్-చైర్మన్ మొల్ల రబ్బానీ,కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ వారి స్వగృహం లో ఎమ్మెల్యే అర్థర్ కు పట్టణ ప్రముఖులకు మరియు అధికారులకు విందు ఏర్పాటు చేశారు.రబ్బానీ బ్రదర్స్ ఆహ్వానం మేరకు శనివారం ఎమ్మెల్యే తోగూర్ అర్థర్ విందుకు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే అర్థర్ కు అల్ హజ్ హాజీ మహబూబ్ సాహెబ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రబ్బానీ,కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రబ్బానీ బ్రదర్స్ కు ఆత్మీయ కౌగిలి తో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ముఖ్య అతిధి ఎమ్మెల్యే అర్థర్ కు అదికారులకు , నాయకులు ముస్లిం సంప్రదాయ కరమైన రుచికరమైన వంటకాలతో విందు ను ఇచ్చారు.ఈ కార్యక్రమములో సీఐ లు సుధాకర్ రెడ్డి,విజయ భాస్కర్,ఎస్సై ఎన్వి రమణ, అధికారులు, వైఎస్ఆర్సిపి నాయకులుపాల్గొన్నారు.

About Author