NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోలవరం కుడి కాలువ నుండి సాగు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం పోలవరం ప్రధాన కుడి కాలువ నుండి రైతులకు సాగు నీటిని విడుదల  ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చేశారు. కొప్పులవారిగూడెం గ్రామంలోని పోలవరం ప్రధాన కుడి కాలువ నుండి రైతులకు సాగు నీటిని విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ,  సీఎం  వైయస్ జగన్ మోహన్ రెడ్డి  రైతన్నలకు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారని, నీటి, విద్యుత్ కష్టాలను దూరం చేయడమే కాకుండా పెట్టుబడి మొదలు పంటల కొనుగోలు దాకా అన్ని విషయాల్లో అండగా నిలిచి ఉన్నారని చెప్పారు. ఇప్పుడు ఈ కాలువ ద్వారా నీటిని విడుదల చేయడంతో, 12 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందని, పంటలు బాగా పండి, అన్నదాత ఇంట్లో సిరులు పండనున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, గౌరవ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి, ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ , ఎంపీపీ , ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, రైతులు, పార్టీ అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

About Author