NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే     

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ మండలంలోని దేవనకొండ గ్రామంలో కోటి 28 లక్షల వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే కంగ్రాట్స్ శ్రీదేవి ప్రారంభించారు. గ్రామ సచివాలయం,వైఎస్ఆర్ రైతు భరోసా, వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్, గడప-గడపకు మన ప్రభుత్వం ద్వారా విడుదలైన కోటి 28 లక్షల రూపాయలతో పత్తికొండ మండలంలోని దేవనకొండ గ్రామంలో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బుధవారం ప్రారంభించారు.  పత్తికొండ మండలం దేవనబండ గ్రామంలో రూ43.60 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామసచివాలయం,రూ23.94లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, రూ 20.84లక్షలతో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ను అలాగే గడప-గడపకు మన ప్రభుత్వం ద్వారా  మంజూరైన 40 లక్షలతో సిసి రోడ్లను  దేవనబండ గ్రామ సర్పంచు ప్రవీణ ఎంపీటీసీ మహాలక్ష్మి ,ఎంపిపి నారాయణదాసు, జెడ్పీటీసీ ఉరుకుందమ్మతో కలిసి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీరాజ్ అధికారులు, వ్యవసాయ అధికారులు, డాక్టర్లు,సచివాలయం సిబ్బంది, మండల సర్పంచులు,ఎంపీటీసీ సభ్యులు,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author