PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిందా కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : చౌకు డిపో డీలర్ గా పనిచేస్తున్న చిందా కృష్ణంరాజు రెండో కుమారుడు చిందా రమేష్ వర్మ (చిన్ని) ఇటీవల మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని గురువారం ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. చిన్న కుమారుని కోల్పోవడం బాధాకరమని ధైర్యంగా ఉండాలన్నారు. ఏమైనా వృత్తిపరమైన సమస్యలుంటే తక్షణం పరిష్కరించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మృతి చెందిన రమేష్ కు భార్య కుమార్తె ఉన్నారు. రమేష్ కుమార్తెను ఓదార్చి బాగా చదువుకోవాలని వైసిపి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. చనిపోయిన రమేష్ ఎమ్మార్వో ఆఫీస్ లో పనిచేసిన రాజాకు స్వయానా తమ్ముడు. ఆయన వెంట స్థానిక కార్పొరేటర్ గూడూరి ఆదిలక్ష్మి ప్రసాద్ మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు చిరంజీవి, కార్పొరేటర్ ఎర్రం శెట్టి నాగబాబు, వైసీపీ సీనియర్ నాయకులు ఎమ్ ఆర్ డి బలరాం, చౌక డిపో డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు రాజులపాటి గంగాధర్ తదితర డీలర్లు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

About Author