PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెక్రటరికి ఎమ్మెల్యే కుమారుడు ఆర్థిక సాయం..

1 min read

 పల్లెవెలుగు వెబ్​,ఏలూరు :  కొప్పులవారిగూడెం గ్రామ సచివాలయ సెక్రెటరీ నాగల్ల సంధ్యారాణికి పెదవేగిలో రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిసి ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి సానుకూలంగా స్పందించి  హుటాహుటిన ఏలూరు ఆంధ్ర హాస్పిటల్ కి వెళ్లి  ఆమెను పరామర్శించి,ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ ఎమ్ ఎల్ వి ప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు. మేజర్ ఆక్సిడెంట్ కావడంతో విజయవాడకు తరలించాలని డాక్టర్లు సూచించగా,ఎమ్మెల్యే వెంటనే సీఎంఓ అధికారులతో మరియు విజయవాడలోని డాక్టర్లతో ఫోన్ ద్వారా మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.ఈ నేపథ్యంలో సంధ్యారాణి ప్రస్తుత చికిత్స ఖర్చుల కోసం ఎమ్మెల్యే  స్వంతంగా 50 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు.అదే విధంగా దగ్గరుండి అంబులెన్సు ను ఏర్పాటు చేయించి మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

About Author