నేడు ఓబులంపల్లె ముండ్లపల్లె,రామనపల్లె లో ఎమ్మెల్యే పర్యటన
1 min read
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీందర్ రెడ్డి, ఆయన తనయులు చింతకొమ్మదిన్నె జెడ్పిటిసి నరేన్ రామాంజనేయులు రెడ్డి మండలంలోని ఓబులంపల్లె, రామన పల్లె, ముండ్లపల్లె పర్యటనకు రానున్నట్లు మండల వైయస్సార్సీపి నాయకులు తెలిపారు, బుధవారం ఉదయం 9:00గంటలకు ఒబులంపల్లె లో నూతనంగా నిర్మించిన గ్రామసచివాలయం,రైతుబరోస కేంద్రం, వైయస్సార్ విలేజ్ క్లినిక్ ప్రారంభోత్సవం జరుగుతుందని అలాగే 9:15 ముండ్ల పల్లె లో రోడ్డు భూమిపూజ శ్మశానవాటిక కు ప్రహరీ గోడ (కాంపౌండ్ వాల్) కి భూమిపూజ ఉంటుందని తెలిపారు, అదేవిధంగా 9:30 రామనపల్లెలో నూతనంగా నిర్మించిన రైతుబరోసా కేంద్రం, వైస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభోస్తవ కార్యక్రమాలకు ముఖ్యఅతిదులుగా కమలాపురం శాసనసభ్యులు పొచమ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలాగే ఆయన తనయులు చింతకొమ్మ దీన్నే జెడ్పీటీసీ పోచమరెడ్డి నరేన్ రామంజులు రెడ్డి కావున మండల వైయస్సార్ సిపి ప్రజా ప్రతినిధులు, నాయకులు , కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు.