PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

1 min read

– వెబ్ కాస్ట్ కెమెరాల ట్రైల్ రన్ ను పరిశీలించినజిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : వెబ్ కాస్ట్ కెమెరాల ట్రైల్ రన్ ను కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుండి జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు పరిశీలించారు.ఆదివారం సాయంకాలం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లోని వెబ్ కాస్ట్ కెమెరాల పనితీరును జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి 107 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కి సంబంధించి ఎర్పాటు చేసిన కెమెరాల పనితీరును కంట్రోల్ రూమ్ నుండి పరిశీలించడం జరిగిందని, ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కెమెరాలు బాగా పనిచేస్తున్నాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్సులు కనపడకుండా మిగతా పరిసర ప్రాంతాలు కెమెరా లో కనపడే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని వాటి యొక్క పని తీరు కి సంబంధించి ఈరోజు ట్రైల్ రన్ నిర్వహించామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వెబ్ కాస్ట్ కెమెరాలకు మరియు వీడియో గ్రాఫిక్ సంబంధించిన నోడల్ అధికారి ప్రతాప్ సూర్యనారాయణ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author