PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంటర్ ఫలితాల్లో మోడల్ కళాశాల హవా..

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రం ఏపీ మోడల్ కళాశాల విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో బాలికలు ప్రభంజనం సృష్టించారు.మండలంలో మొదటి స్థానంలో పి.మహి(నందికొట్కూరు)ఎంపీసీ-967 మార్కులు,,రెండవ స్థానంలో డి.గాయత్రి (దేవనూరు)బైపీసీ-941 బాలికలు ప్రభంజనం సృష్టించారు.ఫస్ట్ ఇయర్ లో 61 మందికి గాను 56 పాస్ అయ్యారు.సెకండ్ ఇయర్ లో 68 కి గాను 63 మంది పాస్ (93%)అయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ సలీం భాష తెలిపారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 46 కు గాను 27 మంది పాస్ అయ్యారు.సెకండ్ ఇయర్ లో 24 కు గాను 20 మంది పాస్ అయినట్లు మద్దూర్ సుమంత్-871 మార్కులతో పాస్ అయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ నాయక్ తెలిపారు. అదేవిధంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఫస్ట్ ఇయర్ లో ఆరుగురికి గాను ముగ్గురు,,సెకండ్ ఇయర్లో 9 కి గాను 7 మందికి పాస్ అయ్యారని జి జయలక్ష్మి-834 మార్కులతో ఉత్తీర్ణత సాధించడం జరిగిందని పాఠశాల ఎస్ఓ విజయలక్ష్మి తెలిపారు.

About Author