PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆధునీకరించిన ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం

1 min read

– ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : కలెక్టరేట్ సముదాయంలో ఆధునీకరించిన ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయాన్ని ప్రణాళిక శాఖ రాష్ట్ర సంచాలకులు బి.గోపాల్ తో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ప్రారంభించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాన్ని కూడా కలెక్టర్ ప్రారంభించారు . ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్య ప్రణాళిక అధికారి వారి కార్యాలయాన్ని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించడం జరిగిందన్నారు. అదే విధంగా సిబ్బంది కూడా అంకిత భావం, నిబద్దతతో పని చేసి జిల్లాను ఇంకా ముందంజలో ఉంచాలని జిల్లా కలెక్టర్ ప్రణాళిక విభాగ సిబ్బందికి సూచించారు.డిఆర్ఓ నాగేశ్వర రావు, పంచాయతీ రాజ్ ఎస్ఈ సుబ్రమణ్యం, ఈ ఈ మద్దన్న, సిపివో అప్పల కొండ, సిబ్బంది, తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ అవరణంలో ఉన్న ఉప సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయ భవన మరమ్మత్తు పనులను కలెక్టర్ పరిశీలించారు.

About Author