PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రధాని మోదీ పాలన.. ఏడేళ్లు పూర్తి

1 min read

– రాజ్య సభ సభ్యులు టీజీ వెంకటేష్​
– సేవా హి సంఘటన్​ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రెండవ సారి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సేవ హి సంఘటన్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని భాగ్యనగర్ లో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్య సభ సభ్యలు టీజీ వెంకటేష్​ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఐదువేల గ్రామాలు, జిల్లాలో 200 గ్రామాలలో బీజేపీ నేతృత్వంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అన్నదానం, రక్తదాన శిబిరాలు, కుట్టు మిషన్లు పంపిణీ తదితర కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలనా అందిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి ,జిల్లా అధ్యక్షుడు రామస్వామి ,పార్టీ సీనియర్ నాయకులు కపిలేశ్వరయ్య, నాయకులు కాలంగి నరసింహవర్మ, కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

About Author