PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్ర‌పంచ నాయ‌కుల్లో అగ్ర‌స్థానంలో మోదీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అత్యతం ప్రజాదరణ కలిగిన ప్రపంచ నాయకుల జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. గ్లోబల్‌ డెసిషన్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ మార్నింగ్‌ కన్సల్ట్‌ తాజాగా నిర్వహించిన సర్వేలో ప్రధాని మోదీ 75 శాతం రేటింగ్‌తో టాప్‌లో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన నాయకులపై మార్నింగ్‌ కన్సల్ట్‌ ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి 23 మధ్య ఒక సర్వే నిర్వహించింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ భారత్‌ను సరైన దిశలో నడిపిస్తున్నారని సుమారు 72 శాతం మందికిపైగా భారతీయులు విశ్వసిస్తున్నారని, కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలోనూ ఆయన నాయకత్వంపై ఇలాంటి నమ్మకమే ఉందని ఈ సర్వే వెల్లడించింది.

                                         

About Author