PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోదీ.. కార్పొరేట్ల సేల్స్ మెన్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ధాని మోదీ పై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కార్పొరేట్ల సేల్స్ మెన్ గా మోదీని అభివ‌ర్ణించారు. ‘‘కార్పొరేట్ల సేల్స్‌మన్‌ ప్రధాని మోదీ. ఆయనకు ముందు దేశానికి 14 మంది ప్రధానులుగా చేశారు. కానీ, మోదీ హయాంలో దిగజారినట్లుగా ఏ ప్రధాని హయాంలోనూ దేశ ప్రతిష్ఠ దిగజారలేదు. ఒక వ్యాపారికి శ్రీలంకలో విద్యుత్తు కాంట్రాక్టు కట్టబెట్టేందుకు సేల్స్‌మన్‌ స్థాయికి మోదీ దిగజారారు. భారత ప్రధాని ఒత్తిడి మేరకే ఆ దేశ వ్యాపారికి కాంట్రాక్టు అప్పగించానంటూ శ్రీలంక పార్లమెంటు కమిటీ ముందు ఆ దేశ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్‌ వెల్లడించారు. మాటకు ముందు, తర్వాత ‘భారత్‌ మాతాకీ జై’ అనే ప్రధాని మోదీ శ్రీలంకలో జరిగిన ఆందోళనలు, ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు మౌనం దాల్చారు!?’’ అంటూ సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు.

                                        

About Author