PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోదీ విరాళం 1000 !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ భార‌తీయ జ‌న‌తా పార్టీకి విరాళం అందించారు. త‌న వంతుగా రూ.1000 రూపాయ‌లు విరాళం అందించారు. విరాళం ఇచ్చిన పే స్లిప్ ను త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వార షేర్ చేశారు. బీజేపీకి విరాళం ఇచ్చి, పార్టీని మరితం బలోపేతం చేయాలని, అలాగే దేశాన్ని బలోపేతం చేసేందుకు సహకరించాలని ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. పార్టీ ఫండ్ కోసం ఈ మొత్తాన్ని అందించినట్లు మోదీ పేర్కొన్నారు. “ మీ చిన్న విరాళం ద్వారా జీవితాంతం నిస్వార్థ సేవ చేసే సంస్కృతి గల మా కేడర్‌ మరింత బలోపేతం అవుతుంది. బీజేపీని మరింత బలోపేతం చేయడంలో సహకరించండి. అలాగే దేశాన్ని మరింత బలోపేతం చేయడానికి కూడా సహకరించండి’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

                                         

About Author