PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోదీ ఫోటో పెట్ట‌డం పై కోర్టుకు.. ల‌క్ష జ‌రిమానా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వ‌్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్ల పై ప్ర‌ధాని మోదీ ఫోటో పెట్ట‌డం పై పీట‌ర్ మైల్ ప‌రంబిల్ అక్టోబ‌ర్ నెల‌లో కోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ పిటిష‌న్ ను కేర‌ళ హైకోర్టు కొట్టివేసింది. పిటిష‌న్ వెనుక ప్ర‌జాప్ర‌యోజ‌నాలు లేవ‌ని, ప్ర‌చారం కోస‌మే వేశార‌ని కోర్టు పేర్కొంది. ప్ర‌జా తీర్పుతోనే మోదీ ప్రధాని అయ్యారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు పిటిషనర్‌కి హైకోర్టు రూ. 1 లక్ష జరిమానాను విధించింది. పైగా ఆరు వారాల్లోగా కేరళ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (కెఎల్‌ఎస్‌ఎ)కి డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, జరిమానాను సకాలంలో జమ చేయడంలో విఫలమైతే అతని ఆస్తులను విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేయాలని కోర్టు పేర్కొంది.

                            
               

About Author