PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిరుద్యోగుల‌కు మోదీ గుడ్ న్యూస్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశంలోని నిరుద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం శుభవార్త వెల్లడించారు. వచ్చే ఏడాదిన్నరలోగా మిషన్ మోడ్‌లో భాగంగా దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వశాఖల్లో 10లక్షలమందిని రిక్రూట్ మెంట్ చేయాలని ప్రధాని మోదీ మంగళవారం కేంద్ర అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలు, కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మానవ వనరుల స్థితిగతులను సమీక్షించిన తర్వాత మోదీ దిశానిర్దేశం చేసినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. నిరుద్యోగ సమస్యపై ప్రతిపక్షాలు తరచూ విమర్శలు గుప్పిస్తున్ననేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ రంగాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న పోస్టులపై ప్రతిపక్షాలు తరచూ ధ్వజమెత్తాయి.

                                            

About Author