PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోదీనే ప్ర‌ధాన శ‌త్రువు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణకు ప్రధాన శత్రువు నరేంద్ర మోదీయేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. దుర్మార్గుడైన మోదీని దేశం నుంచి తరిమికొట్టి అద్భుత భారతదేశాన్ని సృష్టించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. కల్లబొల్లి కథలు తప్ప ఆయన చెప్పిన ఏ ఒక్క వాగ్దానం నెరవేరలేదన్నారు. కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామని చెప్పి 15 పైసలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. మంగళవారం వికారాబాద్‌లో కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించి, ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి బహిరంగ సభలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని మరోసారి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

                                                    

About Author