NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వచ్చే ఎన్నిక‌ల్లో మోదీకి పోటీ ఎవ‌రో తేలిపోయింది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య పోటీ జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చెప్పారు. కేజ్రీవాల్‌ను అడ్డుకునేందుకే తనపై సీబీఐ కేసును నమోదు చేశారని ఆరోపించారు. ఢిల్లీ రాష్ట్ర ఎక్సయిజ్ విధానం అమలులో అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ సీబీఐ శుక్రవారం మనీశ్ సిసోడియా ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో సిసోడియా శనివారం తన నివాసంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా తీవ్రంగా విరుచుకుపడ్డారు.

                                        

About Author