PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోదీ విశాఖ టూర్.. పవన్ తో భేటీ !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ పర్యటనకు రానున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలోని విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖ రానున్న ప్రధానితో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ రేపు విశాఖ పర్యటనకు బయలుదేరనున్నారు. హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న పవన్… నేరుగా విశాఖ చేరుకుంటారు.

About Author