NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శేషవాహనంపై విహరించిన మోక్షణారాయనుడు

1 min read

– ఘనంగా రెండో రోజు మోక్షణారాయనుడి బ్రహ్మోత్సవాలు
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : రామాపురం క్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి సమేత మోక్షణారాయనుడు శేషవాహనంపై, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో అత్యంత వైభవోపేతంగా, నయనానందకరంగా రతోత్సవం నిర్వహిం చారు. రెండో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయం లో స్వామి వార్లకు ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల ఆధ్వర్యంలో ఉదయం అభిషేకాలు, మండప ఆరాధన, అరునపారాయనం, సాయంత్రం హోమాలు, నిర్వహించారు. అలయనిర్వాహకులు కాశి భట్ల సాయినాథ్ శర్మ భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.

About Author