NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీజేపీకి 50 సీట్ల‌కు మించి రావ‌ట‌ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బీజేపీ 2024 ఎన్నికల్లో 50 సీట్లకు మించి గెలుచుకోలేదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. అయితే, విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం సాగించినప్పుడే అది సాధ్యమని అన్నారు. ఈ దిశగా విపక్షాల మధ్య ఐక్యత కోసం తాను కృషి చేస్తున్నానని తెలిపారు. ఇటీవలే బీహార్ లో బీజేపీతో భాగస్వామ్యానికి గుడ్ బై చెప్పి పాత నేస్తం ఆర్జేడీతో జట్టుకట్టిన నితీశ్ కుమార్ మరోసారి సీఎం పీఠం ఎక్కిన సంగతి తెలిసిందే. అవకాశం చిక్కినప్పుడల్లా ఆయన బీజేపీని లక్ష్యంగా చేసుకుని వాగ్బాణాలు సంధిస్తున్నారు. తాజాగా జేడీయూ కార్యనిర్వాహక సమావేశంలో నితీశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

                                         

About Author