PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

9 మంది బిడ్డల‌ను ప్రస‌వించిన త‌ల్లి..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప‌శ్చిమ ఆఫ్రికాలోని మాలిలో అద్భుతం జ‌రిగింది. ఒకే కాన్పులో 9 మంది బిడ్డల‌కు ఓ మ‌హిళ జ‌న్మనిచ్చింది. 25 ఏళ్ల హాలిమా సిస్సే గ‌ర్భం దాల్చింది. ఆమెను వైద్యులు ప‌రీక్షించారు. ఆమె గ‌ర్భంలో 7గురు శిశువులు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆమెకు ప్రత్యేకంగా వైద్యం అందించారు. వైద్యుల‌ స‌మ‌క్షంలో ఆమెను ప‌ర్యవేక్షించారు. మంగ‌ళ‌వారం ఆమెకు నొప్పులు రావ‌డంతో డాక్టర్లు శ‌స్త్ర చికిత్స ద్వార కాన్పు చేశారు. ఈ కాన్పులో హాలిమా సిస్సే 9 మంది బిడ్డల‌కు జ‌న్మనిచ్చింది. వారిలో ఐదుగురు ఆడ‌పిల్లలు కాగా, న‌లుగురు మ‌గ పిల్లలు. 7గురు గ‌ర్భంలో ఉన్నట్టు మొద‌ట గుర్తించిన వైద్యులు… 9 మంది జ‌న్మించ‌డంతో ఆశ్చర్యానికి గుర‌య్యారు. వైద్య శాస్త్రంలో ఇదో అద్భుత‌మ‌ని వైద్యులు చెబుతున్నారు. 9 మంది బిడ్డలు జ‌న్మించ‌డం.. వారంద‌రూ ఆరోగ్యంగా ఉండ‌టం అరుదైన విష‌య‌మ‌ని అంటున్నారు.

About Author