PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మేదర్లను ఎస్టీల జాబితాలో చేర్చాలి

1 min read

పల్లెవెలుగు, వెబ్​ విజయవాడ: ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అట్టడుగు స్థాయిలో ఉన్న మేదర సామాజిక వర్గాన్ని ఎస్టీల జాబితాలో చేర్చాలని ఎన్నో ఏళ్లు గా పోరాటం చేస్తున్న తమకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహేంద్ర మేదర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టంగుటూరి ఎల్లాలబాబు కోరారు. రాష్ట్ర మహేంద్ర మేదర సంఘం 8వ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం ఎంజీ రోడ్డులోని ఎంబీవీకే భవన్లో జరిగింది. 26 జిల్లాల నుంచి సంఘ ప్రతినిధు లు, జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. సంఘ రాష్ట్ర కార్యదర్శి జోరిగే మస్తాన్రావు, కోశాధికారి తెల్లె వైకుంఠరావు, ముఖ్య సలహాదారు ధూళిపాళ ఏసుబాబు, కార్యవర్గ సభ్యులు పిల్లే మాణిక్యాలరావు, నందెకట్టే హనుమా ప్రసాద్, మహిళా అధ్యక్షురాలు రోట్టా లక్ష్మీ, ఎస్టీ సాధన కమిటీ అధ్యక్షుడు సూదేపల్లె ఉమామహేశ్వ రరావు, నేతలు ఇందూరి పుల్లారావు పాల్గొన్నారు.

About Author