PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పూలే విగ్రహవిష్కరణకు తరలిరండి

1 min read

– విగ్రహవిష్కరణకు రావాలని ఆహ్వానిస్తున్న బి.సి.నాయకులు
పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: వెలుగోడు ఈ నెల 16 వ తేదీ మండల కేంద్రమైన పాములపాడు నందు ఉదయం 10 గంటల కు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహవిష్కరణకు ప్రజా ప్రతినిధులు , పలు సంఘాల నాయకులు హాజరు కావాలని జాతీయ బి.సి.సంఘము రాష్ట్ర కార్యదర్శి ఎస్.రఘు రాముడు యాదవ్ కోరారు. ఈ మేరకు వెలుగోడు పట్టణంలో గురువారం కరపత్రాలు పంచడం జరిగింది. లిటిల్ ఏంజిల్స్ స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ ఎం.ఎఫ్.ఇమ్మనియేల్ , ఎంపిపి లాలం రమేష్ , సర్పంచ్ జయపాల్ , బి.సి.నాయకులు గోవిందు , జెడ్పీటీసీ తనయుడు శంషిర్ ఆలీ ,రైతు సంఘము అధ్యక్షుడు రమణ , జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ రత్న స్వామి, గిరిజన సంఘము నాయకులు నగేష్ నాయక్ తదితరులను కలసి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి.సి.నాయకులు నాగేశ్వరరావు , శివుడు , ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author