PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యమ నాయకత్వం.. ఉద్యోగుల ఉసురు తీసింది..

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: గత నెల రోజులుగా ఉద్యోగుల అనుకూల  పి.ఆర్.సి. సాధన కోసం జరుగుతున్న ఉద్యమాన్ని, ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు లేనప్పటికి, పి. ఆర్.సి.సాధన సమితి బలహీన నాయకత్వం, ఉద్యమాన్ని బలహీన పరిచి సమ్మెను అర్థాంతరంగా విరమింపజేయడం దారుణమన్నారు హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ డేగల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురువ చంద్రశేఖర్. లక్షలాది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను నడి సంద్రంలో ముంచేసి విశ్వసనీయతను కోల్పోయిన విధానాన్ని హిందూ ఉపాధ్యాయ సమితి తీవ్రంగా ఖండిస్తున్నది. ఉద్యోగ ఉపాధ్యాయుల, పెన్షనర్ల ప్రయోజనాలు కాపాడటంలో హిందూ ఉపాధ్యాయ సమితి  నిజాయితీ, నిబద్ధత, విశ్వసనీయత లతో అహర్నిశలు కృషి చేస్తుందని  ఈ సందర్భంగా వారు వెల్లడించారు.

About Author