PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్

1 min read

– దిష్టిబొమ్మను చెప్పుతో కొట్టి,దహనం చేసిన టీడీపీ యువ నాయకుడు మోమిన్ ముస్తఫా

– అని అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్ దిష్టిబొమ్మ దహనం

 – చెప్పుతో కొట్టి,కాల్చి దహనం చేసిన  టిడిపి రాయలసీమ

– 2024 ఎన్నికల్లో జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు చస్తాడు..!

– యువ నాయకులు, అధికార ప్రతినిధి మోమిన్ ముస్తఫా.

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఎంపీ గోరంట్ల మాధవ్ కు విలువలు విశ్వసనీయత లేదని, ఆయన ఒక కామపిశాచి అని  గతంలో ఒక మహిళను వేధిస్తూ ఏ విధంగా కామ క్రీడలు చేశాడో దేశమంతా చూశారని టీడీపీ యువ నాయకుడు మోమిన్ ముస్తఫా  అన్నారు.ఒక ప్రతిపక్ష నాయకుడిని ఉద్దేశించి చస్తాడు అని చెప్పడం రాబోయే ఓటమి నుండి ప్రజలను డైవర్ట్ చేయాలనే ఉద్దేశం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ,ప్రజల వెంట ఉంటుందని ప్రజల కోసం పోరాడుతుందని మీలాగా ప్రతిపక్షంలో రాగానే గుండె పగిలి చచ్చే డిఎన్ఏ చంద్రబాబు నాయుడు  కాదన్నారు.2024 లో చంద్రబాబు వస్తే మీ జగన్ రెడ్డి కూడా చస్తాడా అని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని అరాచకాలు చేస్తున్న ఎంపీల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పార్లమెంట్ స్పీకర్ జోక్యం చేసుకొని ఇటువంటి ఎంపీలను  వెంటనే అనర్హత వేటు వేసి దేశ ప్రతిష్టను కాపాడాలి అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు గోస్ మాలిక్, జాకీర్ హుస్సేన్, షేక్షావలి,సలాం,యూసుఫ్ నభిషా తదితరులు పాల్గొన్నారు.

About Author