NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎంను కలిసిన ఎంపీ గురుమూర్తి

1 min read

పల్లెవెలుగు వెబ్​, అమరావతి : తిరుపతి ఎంపీ డా. గురుమూర్తి సోమవారం సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను సీఎం జగన్​ ఈ సందర్భంగా అభినందించారు. కరోనా నేపథ్యంలో పోలింగ్​ శాతం తక్కువగా జరిగినా… వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ ఎం.గురుమూర్తిని 2,71,592 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించారు ప్రజలు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తిరుపతిలో భారీ మెజార్టీ గెలుపునకు కారణమని ఎంపీ డా. గురుమూర్తి చెప్పుకొచ్చారు. సీఎంను కలిసిన వారిలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, సంజీవయ్య తదితరులు ఉన్నారు.

About Author